ఇలాంటి కష్ట సమయంలోనే మనలోని మానవత్వం, దయాగుణం చూపాలని ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఈ రోజు కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతి 19 వార్డు లో తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎంపీటీసీ రఫీ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ రజియా బేగం పర్యవేక్షణలో 550 కుటుంబాలకు ఇంటింటికి 9 కోడిగుడ్లు 1 kg ఉల్లిపాయలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి సూచనల మేరకు ప్రజలందరూ లాక్ డౌన్ బాధ్యతగా పాటిస్తున్నారని, కుటుంబం గడవని పేదలకు మనమందరం అండగా ఉండి నిత్యావసర సరుకులు, కూరగాయలు పంచి మనలోని మానవత్వం, దయాగుణం చాటాలని అన్నారు. అలాగే ఈ రోజు 19 వార్డ్ లో ప్రతి ఇంటికి కోడిగుడ్లు, ఉల్లిపాయలు పంచుతున్న రఫీ, రజియా బేగంను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూనపరెడ్డి వాసు, రఫీ ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు.
previous post
next post