సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 14వ,వార్డులో వడదెబ్బతో అకాల మరణం చెందిన పెండ్ర చిన్న కుటుంబానికి శనివారం రైస్ బ్యాగ్ ను కౌన్సిలర్ ఇందిరాల త్రివేణి వెంకటేష్ అందజేశారు. హుజూర్ నగర్ పట్టణం 14వ, వార్డులో ఇటీవల ఎండ తీవ్రత తట్టుకోలేక వడదెబ్బతో మృతి చెందిన పెండ్ర చిన్న కుటుంబానికి వార్డు కౌన్సిలర్ ఇందిరాల త్రివేణి వెంకటేష్ పెద్ద దిన ఖర్చుల నిమిత్తం బియ్యం బస్తా సహాయం చేశారు. కౌన్సిలర్ గా ఎన్నికైన దగ్గర నుంచి నేటి వరకు వార్డులో ఎవరు చనిపోయిన వారి కుటుంబానికి తమ సొంత ఖర్చులతో ఏదో ఒక రూపంలో తమ వంతుగా సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ ఎండలు తీవ్రతగా ఉండటంవల్ల వడదెబ్బతో చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకొని ఏదో ఒక రూపంలో ఇన్సూరెన్స్ ప్రకటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 14వ,వార్డు అధ్యక్షులు కోల్లపూడి యోహాన్,శివనేని అబ్రహం,కోల్లపూడి కాంతయ్య,పెండ్ర రాంబాబు,పెండ్ర ఎర్రమ్మ,జానమ్మ,పెండ్ర రవి,బోడయ్య,పద్మ,ఉప్పలయ్య,బిక్షం, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్