రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్ తేజ్ ఈ రోజు ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సాయి 35 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు.
నేడు విజయ దశమి, సాయి తేజ్ పుట్టిన రోజు రెండు ఒకే రోజు రావడం.. ఈ రోజే సాయి కోలుకుని ఇంటికి తిరిగి రావడంతో మెగా ఇంట్లో సంతోషం మరింత రెట్టింపు అయ్యింది. సాయి తేజ్కు బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి ట్వీట్ చేశారు.‘విజయ దశమి ప్రత్యేక రోజున సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సాయి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చాడు. చాలా సంతోషంగా ఉంది. ఇటీవల పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డ తేజ్కు ఇది పునర్జన్మ’ అని మోగాస్టార్ చెప్పారు.