హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్తేజ్కు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇంకా వెంటిలేటర్పైనే సాయిధరమ్తేజ్కు చికిత్స కొనసాగుతోంది.
ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు శనివారం ఉదయం తాజా హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రయాణానికి ముందు సాయిధరమ్ తేజ్ ఆహారం తినడంతో.. ప్రమాద వల్ల పుడ్పైప్ నుంచి ఊపిరితిత్తుల పైప్ వరకు ఆహారం చేరింది. ఊపిరితిత్తుల వద్ద ఇరుక్కున్న ఆహారాన్ని వైద్యులు రాత్రి తొలగించారు.
ప్రమాదం వల్ల ఒత్తిడికి గురైన సాయిధరమ్తేజ్ కుడివైపు ఊపిరితిత్తులు జీసీఎస్ స్కోర్ తక్కువగా ఉన్నట్లు వైద్యులు గమనించారు. శరీర భాగాల్లో ఎక్కడైనా అవయవాలు దెబ్బతిన్నాయా అనేదానిపై వైద్యులు పరిశీలిస్తున్నారు. బ్రెయిన్ లో రక్త స్రావం ఏదైనా ఉందేమో కూడా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.