యువ కథానాయకుడు శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా తెరకెక్కనుంది.
ఈ చిత్రాన్ని డైరెక్టర్ కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నారు. విజయదశమి సందర్భంగా ఈరోజు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయింది.
ఈ నేపథ్యంలో శర్వానంద్, రష్మిక తిరుమల విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు దర్శకుడు కిషోర్ తిరుమల, చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా ఉన్నారు.