కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని ఆదుకోవడానికి సినీ హీరో విజయ్ దేవరకొండ ఫౌండేషన్కు విరాళాలు వెల్లువలో వస్తున్నాయి. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు.
ఆయన రూ.25 లక్షల మూలనిధితో ఏర్పాటు చేసిన ‘మిడిల్ క్లాస్ ఫండ్’ కు ఆదివారం సాయంత్రం తొమ్మిది గంటలకు మొత్తం రూ.18,74,805 విరాళం అందినట్లు వెల్లడించారు. 1800 ఈ విరాళం అందించారని ఆయన తెలిపారు. ప్రతి రోజు రాత్రి తొమ్మిది గంటలకు మిడిల్ క్లాస్ ఫండ్కు సంబంధించిన పూర్తి వివరాలను పారదర్శకంగా అప్డేట్ చేస్తానని విజయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
‘ఇవాళ నేను మ్యాజిక్ చూశా. మిడిల్ క్లాస్ ఫండ్ విజయం మీకే చెందుతుంది. మీరు కేవలం ఒక్కరోజులో నా రూ.25 లక్షల్ని రూ.43+ లక్షలు చేశారు. దీని ద్వారా సామాన్యులు, మధ్యతరగతి వారికి కావల్సిన నిత్యావసర సరుకులను కొనుగోలుచేసి ఇవ్వనున్నట్లు చెప్పారు.ఇందు కోసం దేవరకొండ ఫౌండేషన్ పేరుతో ఏర్పాటు చేసిన వెబ్సైట్లో (www.thedeverakondafoundation.org) అత్యవసరమున్న వారు వివరాలు నమోదు చేసుకోవాలని విజయ్ సూచించారు.
ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో తమ బృందం ఇంటిదగ్గరికి వచ్చి సహాయం చెయ్యలేదు కాబట్టి.. సహాయార్థులు ఎవరైనా వాళ్లింటి దగ్గర దుకాణాల్లో సరకులు కొనుగోలు చేస్తే ఆ ఖరీదును ఈ ఫండ్ నుంచి చెల్లిస్తామని విజయ్ పేర్కొన్నారు.