కరోనా థర్డ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలోని తారలకు కరోనా వైరస్ సోకుతోంది.
ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ మహేశ్ బాబు, లక్ష్మీ మంచు, మీనా, వరలక్ష్మీ శరత్కుమార్, బాలీవుడ్ నటి స్వ భాస్కర్ సహా పలువురు కొవిడ్ బారిన పడ్డారు. ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్ త్రిష కూడా ఈ వైరస్ బారిన పడినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.