24.7 C
Hyderabad
March 29, 2024 08: 01 AM
Slider జాతీయం

నళిని పెరోల్ పొడిగింపు కుదిరేది కాదు

nalini 2

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితురాలిగా ఉన్ననళిని పెరోల్ పొడిగించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన కుమార్తె పెళ్లి  ఏర్పాట్ల కోసం పెరోల్‌ కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై జూలై 5న వాదనలు విన్న హైకోర్టు నళినికి నెల రోజుల పాటు పెరోల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నళిని జూలై 25న జైలు నుంచి విడుదలైంది. ఈ నెల 15 నాటికి అంటే రేపటికల్లా ఆమె పెరోల్ సమయం ముగియనుంది. తన కుమార్తె పెళ్లి ఏర్పాట్లు ఇంకా ముగియలేదని, తన పెరోల్ ను ఈనెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించాలని ఆమె హైకోర్టును కోరింది. అయితే నళిని పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి నళిని, ఆమె భర్త మురుగన్‌ సహా ఏడుగురు ముద్దాయిలు యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్నారు.

Related posts

డివైన్ స్పెషల్: జమ్మిచెట్టుకు ప్రదక్షిణ గోమాతకు పూజ

Satyam NEWS

ఆశా కార్యకర్తలకు చీరలు పంచిన వైద్యాధికారి

Satyam NEWS

శ్రమ దోపిడిపై ఐక్య ప్రతిఘటనకు సిద్ధం కావాలి

Satyam NEWS

Leave a Comment