వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కు జర్మనీ పౌరసత్వం ఉందని, రమేష్ బాబు భారతీయ పౌరసత్వం చెల్లదని నేడు హై కోర్ట్ లో జరిగిన విచారణ కు హాజరయిన కేంద్ర హోమ్ శాఖ తెల్చిచెప్పింది .సోమవారం రమేష్ బాబు పౌరసత్వం ఫై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. జర్మనీ పాస్ పోర్ట్ తో మద్రాస్ నుంచి జర్మనీకి వెళ్లారని ఇప్పటికి అయన జర్మనీ పాస్ పోర్టు తోనే విదేశాలకు వెళ్లినట్టు కోర్టుకు హోంశాఖ తెలపగా భారత పౌరసత్వం ఉండగా జర్మనీ పాస్ పోర్ట్ తో జర్మనీకి ఎందుకు వెళ్లారని రమేష్ చెన్నమనేని ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
ఐయితే తానూ భారత పౌరిడినేనని ఇందుకు సంబంధించి 2019 జులై 15న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్ర హోంశాఖ్ పట్టించుకోలేదని కోర్ట్ ముందు హాజరైన రమేష్ తెలుపగా దీనిపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.జర్మనీ పౌరసత్వం ఎప్పుడో రద్దు చేసుకున్నానని చెన్నమనేని కోర్టుకు తెలిపదం తో అయితే మీరు జర్మనీ సిటిజన్ షిప్ వదులుకున్నారా,అందుకు జర్మనీ ప్రభుత్వం ఆమోదించిందా అని ఆయనను హైకోర్టు ప్రశ్నించి జర్మనీ పౌరసత్వం రద్దు చేసుకున్నట్లు,పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలని చెన్నమనేని కి హైకోర్టు అదేషించింది.
వాదోప వాదాలు విన్న తరువాత కేసు రెండు వారాల పాటు వాయిదా వేయనున్నట్లు ధర్మాసనం తెలిపింది.ఈనెల 24న రమేష్ బాబు భవితవ్యం ఫై హై కోర్ట్ ధర్మాసనం తీర్పు వెలువర్చనుంది.
తాజా పరిణామంతో చెన్నమనేని తన ఎమ్మెల్యే పదవి ఉంటుందా ఊడుతుందా అనే సందేహం వెలువడుతుంది.దీనితో తెరాస వర్గాల్లో కలవరం మొదలు కాగా కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ 2009 లోనే ఆది శ్రీనివాస్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. 2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు 2013లో ఎమ్మెల్యే రమేష్ బాబుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.
అయితే ఈ తీర్పుపై సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు రమేష్ బాబు. అలాగే పౌరసత్వ వివాదం కేంద్ర హోంశాఖే తేల్చాల్సి ఉంటుందని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. దీంతో కేంద్ర హోంశాఖ రమేష్ బాబు పౌరసత్వంపై విచారణ చేపట్టింది. ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. కాగా రమేష్ బాబు ఎమ్మెల్యే పదవి పోతుందని అందరు అనుకుంటుండాగానే ఎప్పటికప్పుడు అయన కోర్టు లో ఏదోవిధం గా న్యాయపరమైన అంశాలను చూపుతూ పదవి పోకుండా స్టే తెచ్చుకోవడం తో అయన పదవి పోదు ఈయనకు రాదు అంటూ వేములవాడ ప్రజలు నిష్ఠురమాడుతున్నారు.