మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్టు చేసి కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ నేపథ్యంలోనే కడప ఎంపీని విచారించేందుకు పలుమార్లు నోటీసులు ఇచ్చింది. సీబీఐ నోటీసులతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్కు దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఇటీవలే విచారణ చేపట్టి అవినాష్ రెడ్డి తరఫున న్యాయవాది, సీబీఐ తరఫు లాయర్ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ఈ కేసులో తీర్పు నేడు వెల్లడించనుంది. బాహ్య ప్రపంచానికి కన్నా ముందే సీఎం జగన్కు వివేకా హత్య విషయంపై సమాచారం అందిందని.. అవినాష్ రెడ్డే ఆ విషయం చెప్పారా అనే అంశంపై దర్యాప్తు చేయాల్సి ఉన్నందున.. ఎంపీకి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ వాదనలు వినిపించింది. అదే సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
previous post