28.7 C
Hyderabad
April 25, 2024 04: 58 AM
Slider ముఖ్యంశాలు

రేవంత్ పిటిషన్ పై జూపల్లికి కోర్టు నోటీసులు

jupally revanth

ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడు, వ్యాపారవేత్త అయిన జూపల్లి రామేశ్వరరావుకు నిబంధనలకు విరుద్ధంగా రూ.38 కోట్ల మేరకు స్టాంప్ డ్యూటీ మినహాయించడాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సంబంధిత సంస్థలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాయదుర్గంలో వందల కోట్ల రూపాయల  విలువైన భూమిని జూపల్లి రామేశ్వరరావుకు చెందిన మైహోమ్ సంస్థకు కేటాయించారని రేవంత్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.

విలువైన భూమిని కేటాయించడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా రూ.38 కోట్ల స్టాంప్ డ్యూటీని మినహాయించారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా జూపల్లి రామేశ్వరరావుకు, రాష్ట్ర ప్రభుత్వానికి, డిఎల్ఎఫ్ సంస్థకు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారి సమాధానం కోసం కేసును హైకోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

Related posts

టిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జయశంకర్ సార్ వర్ధంతి

Satyam NEWS

డీఆర్సీ సమావేశంలో విజయనగర సమస్యలపై డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

Satyam NEWS

కిందిస్థాయి బిజెపి, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ కు సహకరించాలి

Satyam NEWS

Leave a Comment