ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ కు హైకోర్టు నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో తమ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.
గతంలో మూడు సార్లు డీజీపీ హైకోర్టు లో హాజరైన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడిని వైజాగ్ లో అడ్డుకున్న సమయంలో డీజీపీని హైకోర్టు సమన్ చేసింది.
ఆ సమయంలో డీజీపీని కోర్టులోనే ఆ సెక్షన్ కు సంబంధించిన వివరాలు చదవమని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఒకసారి హెబియస్ కార్పస్ పిటీషన్ల విషయంలో కూడా డీజీపీ హైకోర్టుకు హాజరు అయ్యారు.
ఇక మరో కేసులో కూడా డీజీపీ హైకోర్టు ముందుకు వచ్చారు. అయితే ఇప్పుడు మరో కేసులో డీజీపీని రమ్మని హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం చర్చనీయాంశం అయింది.
రామారావు అనే ఒక ఏఎస్ఐని సిఐగా ప్రమోషన్ ఇచ్చే విషయంలో ఆయన కోర్టుకు వచ్చారు.
ఈ సందర్భంగా కోర్టులో వ్యాజ్యం వేయగా, కోర్టు సిఐగా ప్రమోషన్ ఇచ్చే ప్యానెల్లో ఆయనకు అవకాశం ఉందో లేదో అనే అంశం పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పోలీస్ శాఖ అమలు చేయలేదని ఏఎస్ఐ రామారావు మరోసారి కోర్టు ముందుకు వచ్చారు.