27.7 C
Hyderabad
March 29, 2024 04: 17 AM
Slider ఆంధ్రప్రదేశ్

కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

AP High court

అమరావతి నుంచి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని అంశంపై పిటిషన్లు పెండింగ్ లో ఉన్న తరుణంలో కార్యాలయాలను ఎలా తరలిస్తారని ప్రశ్నించింది. ఫిబ్రవరి 26 వరకు కార్యాలయాలను తరలించొద్దంటూ తాము ఆదేశాలను జారీ చేసినప్పటికీ ఎందుకు తరలిస్తున్నారని నిలదీసింది.

ఈ సందర్భంగా ఏజీ స్పందిస్తూ అమరావతిలో కార్యాలయాల నిర్వహణ సరిగా లేదని, కార్యాలయాల తరలింపు అనేది ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, స్థానికంగా ఉన్న స్థలంలోనే కొత్త నిర్మాణాలను చేపట్టవచ్చు కదా? అని ప్రశ్నించారు. ఈ పిటిషన్ తో మరో రెండు పిటిషన్లను కలిపి మధ్యాహ్నం మరోసారి విచారణ చేపడతామని చెప్పారు.

Related posts

క‌రోనాతో బీజేపీ కార్పొరేట‌ర్ ఆకుల ర‌మేష్‌గౌడ్ మృతి!!!

Sub Editor

మే 4 నుండి 6 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

Satyam NEWS

హుజూర్ నగర్ లో సిఐటియు జీప్ జాత విజయవంతం

Satyam NEWS

Leave a Comment