30.7 C
Hyderabad
April 19, 2024 09: 49 AM
Slider పశ్చిమగోదావరి

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడి ఎన్నికపై హైకోర్టు స్టే

#aryavysyasangham

పశ్చిమగోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడి ఎన్నిక పై రాష్ట్ర హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని పశ్చిమగోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు తెలిపారు.

ఈ కారణంగా జంగారెడ్డి గూడెం లోని ఆలపాటి గంగా భవాని కళ్యాణమండపం లో జరిగే కార్యక్రమానికి ఆర్య వైశ్యులు ఎవరూ హాజరు కావాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు.

జంగారెడ్డి గూడెంలో మహంకాళి రంగప్రసాద్ ఆధ్వర్యంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆర్య వైశ్యులు హాజరు కావడం కోర్టు తీర్పును ఉల్లంఘించినట్లు అవుతుందని ఆయన తెలిపారు.

ఈ విషయాన్ని రంగ ప్రసాద్ కు కూడా తెలిపామని ఆయన అన్నారు.

హైకోర్టు వెలువరించిన తీర్పు కాపీని జంగారెడ్డిగూడెం డిఎస్ పి రవికిరణ్ కు కూడా ఇచ్చామని కోన శ్రీనివాసరావు తెలిపారు.

ఈ ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్ పి  హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

Related posts

రైతుల పట్ల శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేయాలి

Bhavani

ములుగు పేరెంట్స్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గం

Satyam NEWS

రామాపురం భూముల పై సమగ్ర విచారణ చేపట్టాలి

Satyam NEWS

Leave a Comment