అమరావతి ఉద్యమం: సీఎం ఇంటికి సెక్యూరిటీ పెంచిన పోలీసులు రాజధాని అమరావతిని తరలించొద్దంటూ రైతులు, కూలీలు, మహిళలు గత 549 రోజులుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. రేపటితో ఈ ఉద్యమం 550 రోజులకు చేరుకోనుంది. ఈ క్రమంలో రైతులు భారీ ర్యాలీలు, నిరసనలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. రైతుల ర్యాలీలు, నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గాల వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ హైఅలర్ట్ నడుమ శనివారం నాడు ఏం జరుగుతుందో…? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
previous post