ఈ ఏడాది వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండనున్నాయి . ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు . ఏప్రిల్ నెలా ఖరు నుంచే వడగాలుల తీవ్రత అధికంగా ఉండి , మే నెలలో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
మార్చి నెల నుంచే పగటి ఉష్ణోగ్రతలు 40 సెల్సియస్ డిగ్రీల వరకు నమోదు కావొచ్చని, ఏప్రిల్లో 45 డిగ్రీల వరకు , మే నెల ప్రారంభం నుండి జూన్ మొదటి వారం వరకు 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవ కాశం ఉన్నదని ఆధికారులు అంచనా వేశారు . అయితే ఇదే సమయంలో ఈ వేసవిలో అక్కడక్కడా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, గాలిదుమారాలు కూడా రావొచ్చని చెప్పారు.