ములుగు మండలంలోని మదనపల్లి గ్రామానికి చెందిన హిందీ ఉపాధ్యాయుడు పోరిక మోహన్ సింగ్ (40)శనివారం కరోనాతో మృతి చెందారు.
దీనికి సంబంధించి గ్రామస్తులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పోరిక మోహన్ సింగ్ మూడు చెక్కల పల్లి బాలికల ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్టు రెసిడెన్షియల్ హిందీ టీచర్ గా పనిచేస్తున్నాడు.
కాగా గత 20 రోజుల క్రితం మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందారు.
మృతునికి భార్య, కుమారుడు కుమార్తె ఉన్నారు. ఉపాధ్యాయుల మృతితో మదన్ పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.