27.7 C
Hyderabad
April 26, 2024 04: 00 AM
Slider వరంగల్

కరోనాతో ములుగులో హిందీ ఉపాధ్యాయుడు మృతి

#Hindi Teacher

ములుగు మండలంలోని మదనపల్లి గ్రామానికి చెందిన హిందీ ఉపాధ్యాయుడు పోరిక మోహన్ సింగ్ (40)శనివారం కరోనాతో మృతి చెందారు.

దీనికి సంబంధించి గ్రామస్తులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పోరిక మోహన్ సింగ్ మూడు చెక్కల పల్లి బాలికల ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్టు రెసిడెన్షియల్ హిందీ టీచర్ గా పనిచేస్తున్నాడు.

కాగా గత  20 రోజుల  క్రితం మోహన్ సింగ్ కు కరోనా  పాజిటివ్ గా నిర్ధారణ కాగా  హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందారు.

మృతునికి భార్య, కుమారుడు కుమార్తె ఉన్నారు. ఉపాధ్యాయుల మృతితో మదన్ పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related posts

యాక్సిడెంట్: రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలు

Satyam NEWS

గుండె గుభిల్లుమనిపించిన వేంకటరమణ దీక్షితుల డిమాండ్

Satyam NEWS

విక్రమ సింహపురి యూనివర్సిటీకి ఐఎస్ఓ ప్రమాణాలు

Satyam NEWS

Leave a Comment