39.2 C
Hyderabad
April 23, 2024 16: 20 PM
Slider ప్రకాశం

హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నిరసన ర్యాలి

#VHP

బంగ్లాదేశ్ లో అరాచక ముస్లిం తీవ్రవాదులు అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు, హిందూ దేవతా మూర్తుల ధ్వంసంపై నిరసనగా హిందూ ధార్మిక సంఘాలు ఒంగోలులో నిరసన వ్యక్తం చేశాయి. హిందూ దేవాలయముల కూల్చివేత, హిందూ మహిళలపై అఘాయిత్యాలు చేస్తున్న నేపధ్యంలో సాటి హిందువులుగా నిరసన తెలుపక పోతే విపరీత పరిణామాలు దారితీస్తాయని వారన్నారు. హిందువులలో ఐక్యత సాధించేందుకు విశ్వహిందూ పరిషత్, మాతృశక్తి, ఇస్కాన్ తదితర ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యములో నిరసన ర్యాలి నిర్వహించి అనంతరం ప్రకాశం జిల్లా కలెక్టరు కు విజ్ఞాపన పత్రం అందచేశారు.

కార్యక్రమములో ముందుగా కేశవ స్వామి పేట దేవాలయముల వద్ద నుండి కలెక్టరేట్ వరకు జై శ్రీరామ్, బంగ్లాదేశ్ హిందువులను కాపాడాలని, భారతదేశంలో ఉండాలంటే వందేమాతర గీత పాడాల్సిందే అంటూ… నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ ద్వారా భారత రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఇస్కాన్ మందిర మేనేజర్ సుభశ్రీ చైతన్య దాస్ (దేవరపల్లి సుబ్బారెడ్డి) మాట్లాడుతూ భవిష్యత్ లో భారతదేశం సుభిక్షంగా ఉంటూ ముష్కర మూకలను ఎదుర్కొనాలటే హాందువులందరూ ఏకంకావాలని అన్నారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ్ సోమా సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లిఖార్జున రావు, కార్యదర్శి పందరబోయిన పున్నారావు, నగరఋఅధ్యక్ష కార్యదర్శులు పసుమర్తి వేంకటేశ్వర్లు, నార్నె మురళికృష్ణ, బజరంగదళ్ సంయోజక్ ఐ. సీతారామయ్య, మాతృశక్తి శ్రీరామనేని సీతాలక్ష్మీ రామానుజ దాసి, ఇస్కాన్ గురుజీలు ఆంజనేయ రఘుపతి ప్రభు, మాధవ నారాయణ్ ప్రభు, ప్రచారక్ రాధా రమణ గుప్తా జంధ్యం, మఠంపల్లి దుర్గేష్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ భానుప్రియకు VFSSS సన్మానం

Satyam NEWS

ఆర్టీసి ప్రయాణికులు కు గుడ్ న్యూస్

Bhavani

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు పకడ్బందిగా చేస్తున్న అధికారిపై బదిలీవేటు

Bhavani

Leave a Comment