కరోనా వైరస్ వ్యాప్తి చేయడానికి టీడీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లారా అని అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. కంప్లైంట్ చేయడానికి వారి వద్ద కంటెంట్ లేదని విమర్శించారు. బీజేపీ వాళ్లు బయటకు తరిమేశారని ఆక్రోశం తో వారికి కరోనా అంటించేందుకు వెళ్లారా అని ప్రశ్నించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ స్థాయిలో ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ఏమని కంప్లైంట్ ఇస్తారన్నారు. టీడీపీ వారు ఢిల్లీకి వెళ్ల కంప్లైంట్ చేయడం తెలుగు ప్రజలను అవమానించడమే అన్నారు.
రాష్ట్రపతి ఏపీ నుంచి రిపోర్టు తీసుకుంటే, సీఎం జగన్ ను అభినందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. అంతా చట్ట బద్ధంగానే సాగుతుందని, ఇది ప్రతిపక్షం గుర్తు పెట్టుకోవాలని సూచించారు.