28.2 C
Hyderabad
May 24, 2025 09: 31 AM
Slider అనంతపురం

ఆదర్శవంతమైన నియోజకవర్గంగా హిందూపూర్

#NandamuriBalakrishna

హిందూపూర్ నియోజకవర్గంలో సోమవారం నాడు స్థానిక శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. రెవిన్యూ శాఖ, ఆధ్వర్యంలో హిందూపురంలోని మున్సిపాలిటీ పరిధిలో కొట్టునూరు గ్రామం కొల్లకుంట కాలనీలో 237 ఇంటి పట్టాలకు పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ టీడీపీ…అటువంటి టీడీపీకి బడుగు, బలహీన వర్గాల నియోజకవర్గమైన హిందూపురం ఎల్లప్పుడూ అండగా ఉందన్నారు. నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వెయ్యి కోట్ల రూపాయాల విలువైన ఇళ్ల స్థలాల స్వాధీన పత్రాలను 3 వేల మందికి పంపిణీ చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం మాది. సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం. వచ్చే నెల్లో  తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు చేయబోతున్నాం.

అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ అశీస్సులు మెండుగా ఉన్నాయి. అమరావతితోపాటు రాజధాని కలుపుతూ జరిగే అన్ని రహదారుల నిర్మాణం అన్ని త్వరగా జరగాలని ప్రధాని మోదీ కోరుతున్నారు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గ ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. 237 ఇంటి పట్టాల కు Possession సర్టిఫికెట్ పంపిణి చేయడం జరిగింది. ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాల కు సర్వ హక్కులు కల్పించాలనే ఉద్దేశ్యం తో హిందుపుర్ పట్టణo kotnuru గ్రామం కొల్లకుంట కాలని లో position ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ సర్టిఫికెట్ తో మీరు బ్యాంకు ల ద్వారా లోన్ తీసుకొని జీవనోపాధి కోసం మగ్గాలు ఏర్పాటు చేసుకోవడం లేదా వేరే స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన సంవత్సరం లోపే NREGS నిధులు సుమారు 50 కోట్ల రూపాయల తో ప్రతి గ్రామానికి తారు రోడ్డు. సౌకర్యం, CC రహదారులు, డ్రైనేజీ లు ఏర్పాటు చేసాము. మున్సిపాలిటి లో 38 వార్డులలో CC రహదారులు, డ్రైనేజ్ లు ఏర్పాటు చేయడానికి CM గారి తో మాట్లాడి 92.5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం. జరిగింది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. హిందూపురం పట్టణం లో తాగునీటి సమస్య శాశ్వత. పరిస్కారం కోసం అంతర్గత పైప్ లైన్ నిర్మాణం కోసం 136 కోట్ల తో ప్రతిపాదనలు పంపించాం, ఈ నిధులు కూడాత్వరలో మంజూరు 53 పనులు ప్రారంభం చేస్తామని తెలిపారు.

వినాయక నిమజ్జనం చేసి గుడ్డం కోనేరు మరమ్మాతులకు AHUDA నుండి 1 కోటి యాభై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. Handlooms and Textiles జిల్లా Skill Development వారి అధ్వర్యం లో మహిళలకు ఉపాధి కల్పించాలని, వారికి స్వయం ఉపాధి కలిగించడానికి. వారు ఆర్థికంగా ముందడుగు వేయడానికి ప్రభుత్వం 60 మంది మహిళలకు ఉచితంగా 60 రోజులు శిక్షణ ఇచ్చి, విలువైన కుట్టు మెషిన్ లను పంపిణీ చేస్తుంది. ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం చాలా కార్యక్రమాలు అమలు చేస్తుంది. మహిళా సంఘాలకు విరివిగా loans మంజూరు చేస్తూ ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి BC welfare వారి ఆధ్వర్యంలో హిందూపురం నియోజకవర్గం లో సుమారు 2000 మందికి టైలరింగ్ లో 3 నెలలు శిక్షణ ఇచ్చి కుట్టు మెషిన్ లను అందించడం జరుగుతుంది.

నియోజకవర్గం మొత్తం 20 కేంద్రాలు గుర్తించము, ఇప్పటికే 5 కేంద్రాలలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు 237 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు అందజేయుచున్నాము. తర్వాత ఈ పత్రాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, పొదుపు, మెప్మా మహిళా సంఘాలు రుణం కొరకు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు. అలాంటి పద్ధతుల్లోని రుణం కొరకు ఆన్లైన్ నందు నమోదు ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో టేకులోడు, తుమ్ము కుంట ప్రాంతాలలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఇక్కడే ఉపాధి దొరుకుతుందని తెలిపారు.

అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అంతకు మునుపు 9 మందికి పట్టాలు పంపిణీ చేశారు, రాధమ్మ, లక్ష్మీదేవి, పద్మ, వనజ  మంజుల, జయమ్మ, దేవరాజులు, ఇతరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్ కుమార్, మున్సిపల్ చైర్మన్D E రమేశ్, పి డి హౌసింగ్ మరియు స్పెషల్ ఆఫీసర్, హిందూపూర్ వెంకటనారాయణ మున్సిపల్ కమిషనర్ సంఘం శ్రీనివాసులు, వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్శ్రీ మల్లికార్జున్ గౌడ్, స్థానిక మొదటి వార్డ్ TDP పార్టీ చంద్ర శేఖర్ సత్యసాయి జిల్లా TDP పార్టీ అధ్యక్షులు V అంజినప్ప, జిల్లా TDP పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు శివశంకర్, న్యాయవాది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్  K పరిమళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్శ్రీ ఎమ్ ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.

Related posts

రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టి.యన్. ఎస్.ఎఫ్. నిరసన

Satyam NEWS

4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావాలని పూజలు

Satyam NEWS

కదిలే బస్సులో…. ప్రాణం తీసిన అజాగ్రత్త

Satyam NEWS
error: Content is protected !!