28.7 C
Hyderabad
April 20, 2024 05: 34 AM
Slider వరంగల్

హిందూస్థాన్ డీజే యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

#dj

డీజే, బ్యాండ్ మేళాలు నిర్వహించే నిరుద్యోగ యువత ఒక కమిటీగా ఏర్పాటు అయింది. ములుగు జిల్లా ములుగు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలోని వీరంతా కలిసి మండల స్థాయి నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. హిందుస్థాన్ డీజే అండ్ బ్యాండ్ మేళా మండల అధ్యక్షునిగా పోరిక మోహన్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా యాద సంపత్, ఉపాధ్యక్షునిగా మల్లంపల్లి చారి, కార్యదర్శిగా గణపతి, కోశాధికారిగా ఎండీ.బబ్బుల్, ప్రచార కార్యదర్శిగా భూక్య సాయి, సలహాదారుగా పోరిక బాలాజీ, పర్యవేక్షులుగా పందికుంట చింటు, చంటి, కార్యవర్గ సభ్యులగా అచ్చునూరి కిరణ్, పోరిక అర్జి నాయక్, పోరిక వెంకటేష్, చందా రాము, ధరావత్ రాజు, చతుర్వేదుల రామక`ష్ణ, ఇమ్మానియల్, ఉపేందర్, శానబోయిన ప్రశాంత్, సూరం రమేష్ లు ఎంపికయ్యారు. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సొంతంగా డీజే, బ్యాండ్ మేళాలను ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నామని, ప్రజలు తమను ఆదరించాలని హిందూస్థాన్ డీజే యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోరిక మోహన్, యాద సంపత్ కోరారు.

Related posts

విద్వేషం: స్వేరోస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు

Satyam NEWS

ఆంధ్రమహిళా సభలో కంటి స్క్రీనింగ్ క్యాంపు

Satyam NEWS

రాజాసింగ్ కు బెయిల్ మంజూరు

Satyam NEWS

Leave a Comment