విజయనగరం అంటే విద్యలనగరం,…కళలకు కాణాచి..ఎందరో సంగీత విద్వాంసులు నడియాడిన నాటిపల్లె…ప్రస్తుతం విజయనగరం గా భాసిల్లుతోంది. అటువంటి నగరంలో ఎన్నో సంగీతసంస్థలు..నాట్య అకాడమీలు, అలాగే విద్వాంసులు…నాట్యాచారాలు ఖండాంతరాల్లో విజయనగరం కీర్తి పతాకాన్ని ఎగుర వేసారు.
తాజాగా అదే సంగీత నిలయమైన విజయనగరంలో ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ 619వ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ నెల 10 వ తేదీన నగరంలోని కానుకుర్తివారి సత్రంలో హైదరాబాద్ కు చెందిన శ్రీ జానకిరామ సేవాసమితి,ఉత్తరాది మఠం సంయక్త ఆధ్వర్యంలో హిందూస్తానీ కచేరీ నిర్వహిస్తోందని ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి మండపాకరవి తెలియ చేసారు.
తమ సంస్థ 619 వ కార్యక్రమంలో లో భాగంగా శ్రీ జానకిరామ సేవాసమితి-హైదరాబాద్ మరియు ఉత్తరాది మఠం సంయుక్త నిర్వహణలో హిందూస్తాని శాస్త్రీయ భక్తి సంగీత కచేరీ ని ఈ నెల పదో తేదీన సాయంత్రం గంటల నుండి 8 గంటల వరకు కానుకుర్తి వారి సత్రం లయన్స్ క్లబ్ లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
లతామంగేష్కర్ అవార్డు గ్రహీత మధ్యప్రదేశ్ భోపాల్ కి చెందిన వాణి రావు భక్తి సంగీత సంగీత కచేరీకి దామోదర్ రావు హార్మోనీయం పైన, ప్రవీణ్ కీబోర్డ్ పైన, రాజ తబలా పైన, విజయకుమార్ పాడ్స్ పైన సహకారం అందిస్తారని చెప్పారు.