భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యం లో విద్యాసంస్థలకు ఇప్పటికే ప్రకటించిన సెలవులను 16 తేదీ వరకు పొడిగించాలని సీఎం కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈమేరకు విద్యాశాఖ అధికారులను ఉత్తర్వులు జారీ చేయాలని సమీక్ష సమావేశం నించే సీఎం కేసిఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలకు ఇంతకు ముందే ప్రకటించిన మూడు రోజుల సెలవులు నేటితో ముగిశాయి.