తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటీవ్ లక్షణాలు కనిపించాయి. ఇప్పటికే తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటీవ్ రాగా వారు చికిత్స పొందుతున్నారు. తాజాగా హో మంత్రికి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కరోనా కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న విషయం తెలిసిందే.
లెక్కకు మించిన పాజిటీవ్ కేసులు వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తలపట్టుకు కూర్చున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో మళ్లీ లాక్ డౌన్ విధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్న సమయంలో హోం మంత్రి మహమూద్ అలీకి పాజిటీవ్ అనే వార్త వెలువడటం గమనార్హం.