కడప జిల్లా వేంపల్లె మండల కేంద్రంలో లోని గండి-పులివెందుల బైపాస్ రోడ్డు లో ఉన్న ఓ ఇంట్లో చోరి జరిగింది. షేక్ మహమ్మద్ రఫి అనే కుటుంబం ఇంట్లో లేని సమయంలో చోరీ జరిగింది.
ఇంట్లో చెల్లాచెదురుగా బట్టలు, వస్తువులను పడవేసిన దొంగలు.35 గ్రాముల బంగారం, నలభై వేల రూపాయల నగదు చోరి చేసినట్లు బాధితులు వెల్లడించారు.
శనివారం సొంత ఊరికి వెళ్లి ఈ రోజువచ్చి ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా, ఇంటి డోర్లు తెరిచి ఉండడంతో దొంగ తనం జరిగినట్లు గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటన స్థలానికి వేంపల్లి ఎస్ఐ సుబాచంద్ర బోస్ చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.