కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని రాంపూర్ కలాన్ గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీకై ఇల్లు దగ్ధమైంది
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం రాంపూర్ కళను గ్రామానికి చెందిన గులా రాములు, గుల పాపయ్య ఒక కబిరాబోయి కుటుంబాలు ఉమ్మడిగా నివసిస్తున్నారు.
ఉదయం పొలం పనులకు వెళ్లేందుకు గాను రాములు భార్య వంట చేసేందుకు గ్యాస్ సిలిండర్ ఆన్ చేయగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించి మెల్లమెల్లగా మంటలు ఇంటి మొత్తం వ్యాపించడంతో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి అన్నారు.
నేటి ఉదయం సిలెండరు వెలిగించేసరికి ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు . ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
స్థానికులు బాన్స్వాడ అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. కొన్ని రోజుల్లో ఇంట్లో పెళ్లి ఉన్నందువలన బంగారం నగదు బియ్యం కాలి బూడిదయ్యాయని బాధితులు వాపోయారు.