స్థానిక సంస్థల ఎన్నికల కొనసాగింపులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ 28 వ తేదీన (బుధవారం)రాజకీయ పార్టీలతో నిర్వహించ తలపెట్టిన సమావేశం జరుగకుండా స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
ఈ మేరకు మంగళవారం రాత్రి హై కోర్టు లో అత్యవసరంగా హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది.
సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం తో సంప్రదించకుండా రాజకీయ పార్టీ లతో సమావేశం నిర్వహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటీషన్ లో పేర్కొంది.
సుప్రీం కోర్టు ఆదేశాలకు భిన్నంగా జరుగుతున్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్ 28 వ తేదీన నిర్వహిస్తున్న సమావేశాన్ని నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తన పిటీషన్ లో హై కోర్టు ను అభ్యర్థించింది.