హైదరాబాద్ నల్లకుంట లో భారీ చోరి జరిగింది. కాకినాడ ఇంద్రపాలెంకు చెందిన అనుసూరి శివశంకర్ సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తూ నల్లకుంట తిలక్నగర్లో భార్యతో కలసి ఉంటున్నాడు. అతను పెండ్లి రోజు వేడుకలు ఆనందంగా జరుపుకునేందుకు ఊటీకి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఎవరో దొంగలు ఇల్లు లూటీ చేశారు. పెండ్లి రోజు వేడుకలు జరుపుకునేందుకు శివశంకర్ గత శనివారం తమిళనాడు రాష్ట్రం ఊటీకి వెళ్లారు.
సోమవారం ఉదయం కిటికీలు తెరిచి ఉండగా ఇంటి యజమాని ప్రసాద్ అనుమానంతో శివశంకర్కు ఫోన్ చేశాడు. మంగళవారం ఉదయం ఊటీ నుంచి తిరిగి వచ్చిన శివశంకర్ ఇంట్లోకి వె ళ్లి చూడగా బీరువాలో ఉన్న 32 తులాల బంగారు ఆభరణాల తో పాటు కిలో వెండి వస్తువులు కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నల్లకుంట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.