39.2 C
Hyderabad
March 29, 2024 16: 58 PM
Slider వరంగల్

కరోనాతో హౌసింగ్  బోర్డు డిప్యూటీ ఈఈ శ్యామల్  మృతి

#housingboard

హౌసింగ్ బోర్డు డిప్యూటీ ఈఈ అజ్మీర శ్యామల్ (52 )ఆదివారం మధ్యాహ్నం కరోనా తో మృతి చెందారు.  ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం మల్లయ్య పల్లి గ్రామానికి చెందిన అజ్మీరా శ్యామల్ పది రోజుల క్రితం కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది. పది రోజులుగా హన్మకొండ లో ఓ  ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా ఆయన మృతిని గ్రామస్తులు జీర్ణించుకోవడం లేదు. మంచి మనసున్న వ్యక్తని పలువురు ఆయనను కొనియాడారు. ఆయన మృతితో మల్లయ్య పల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకుంటున్నాయి. మృతునికి భార్య అజ్మీర కృష్ణవేణి నాయక్ బిజెపి  రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కాగా ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Related posts

అమెరికాలో కీలక పదవుల్లో 20 మంది భారతీయ అమెరికన్లు

Satyam NEWS

గోమాతకు గ్రాసం అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

ఎట్టకేలకు పెద్దపల్లి పోలీసులకు దొరికిన కిడ్నాపర్లు

Satyam NEWS

Leave a Comment