హౌసింగ్ బోర్డు డిప్యూటీ ఈఈ అజ్మీర శ్యామల్ (52 )ఆదివారం మధ్యాహ్నం కరోనా తో మృతి చెందారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం మల్లయ్య పల్లి గ్రామానికి చెందిన అజ్మీరా శ్యామల్ పది రోజుల క్రితం కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది. పది రోజులుగా హన్మకొండ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా ఆయన మృతిని గ్రామస్తులు జీర్ణించుకోవడం లేదు. మంచి మనసున్న వ్యక్తని పలువురు ఆయనను కొనియాడారు. ఆయన మృతితో మల్లయ్య పల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకుంటున్నాయి. మృతునికి భార్య అజ్మీర కృష్ణవేణి నాయక్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కాగా ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.