గద్వాల మున్సిపాలిటి పరిధిలోని ఆయా కాలనీలో డ్రైనేజీ కాలువలో రోజు రోజుకు చెత్త పేరుకపోతుంది. ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లు, బాటిల్సే దర్శనమిస్తున్నాయి. దీంతో మురుగు కాలువలో మురుగునీరు నిలిచిపోయి దుర్వాసనతోపాటు దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారు. మురుగుకాలువలో చెత్తను
తొలగించడానికి కార్మికులు కాలువలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. కార్మికులు ప్రాణాలు సైతం ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ నిషేదం పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చినప్పుడే డ్రైనేజి కాలువలో మురుగు నీరు సాఫీగా పోతాయని ఇప్పటికైనా ప్రజలు ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్, గ్లాసులు మురుగు కాలువలో వేయరాదని పట్టణవాసులు కోరుతున్నారు.