గత మూడు సంవత్సరాలుగా భారత రైల్వేల్లో ఎన్ని నియామకాలు జరిపారు ? ఎన్ని రిక్రూట్మెంట్ డ్రైవ్లు నిర్వహించారని ఖమ్మం లోక్సభ సభ్యులు నామ నాగేశ్వర రావు పార్లమెంట్ వేదిక గా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే, ఈ అంశాలన్నీ తాము పార్లమెంట్కు ఇదివరకు సమర్పించామని వెల్లడించారు. రైల్వేలో నియామకాలు జోన్లవారీగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేస్తామని వివరించారు. ఖాళీల ఆధారంగా తాము తరచూ నియామకాలు చేపడుతున్నామని చెప్పారు. ఫలితాల వెల్లడికి ప్రత్యేకంగా సమయం అంటూ లేదని, నియామక ప్రక్రియలో భాగంగా వెల్లడిస్తున్నామని తెలిపారు.
previous post
next post