నిత్యం వేద ఘోషతో పరిఢవిల్లే శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలకు హైదరాబాద్ వాస్తవ్యులు అక్షరాల లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మట్టపల్లి మహా క్షేత్రంలో వేద,స్మార్త విద్యలను పరిఢవిల్ల చేయాలని,అంతరిస్తున్న మన ప్రాచీన సంప్రదాయ వేదాధ్యయనం అంతరించకూడదనే సుసంకల్పంతో గడిచిన నాలుగు సంవత్సరాల నుండి శ్రీ మట్టపల్లి లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలను ప్రారంభించి ఔత్సాహికులైన విద్యార్థులకు వేద,స్మార్త విద్యలను దాతల సహాయ,సహకారాలతో నేర్పిస్తున్నారు.
హైదరాబాద్ వాస్తవ్యులు సంధ్యావందన అభ్యసన శిక్షణా సమితి వారు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్ర మూర్తి, జయలక్ష్మి గార్లు మట్టపల్లి వేద స్మార్త పాఠశాలను సందర్శించి పాఠశాలలో విద్యార్థులకు జరుగుతున్న విద్యాబోధన, విద్యార్థులు,వారి తల్లిదండ్రులు వేద స్మార్త విద్యల పట్ల చూపుతున్న ఆసక్తికి అబ్బురపడి కల్వకొలను చిత్తరంజన్ స్మారక సేవా సంస్థ దశాబ్ది మహోత్సవ వేడుకల్లో భాగంగా వేద,స్మార్త,పాఠశాల, విద్యార్థుల అభివృద్ధి నిమిత్తం 1,00,000 రూపాయల చెక్కును పాఠశాల అధ్యాపకులు వేద ఘనాపాటి చీమలపాటి ఫణి శర్మ కు అందచేశారు.
ఈ సందర్భంగా చిత్తరంజన్ దాస్ స్మారక చారిటబుల్ ట్రస్ట్ అధినేత కల్వకొలను శ్రీరామచంద్ర మూర్తి మాట్లాడుతూ ప్రాచీన ఋషులు మనకు అందించిన వేద విద్యను కాపాడుకోవలసిన బాధ్యత మనపై,భావితరాల వారిపై ఉందని అన్నారు.విద్యార్ధులు ఉత్సాహంగా విద్యను అభ్యసిస్తున్నందుకు వారిని అభినందించారు.
అమెరికా లో ఉన్న మన తెలుగు వారు వేద ధర్మంపై ఉన్న మక్కువతో శ్రీ కిరణ్, సౌమ్య 10,000 రూపాయలు,శశి 25,000 రూపాయలు శ్రీ మట్టపల్లి లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాల ఎకౌంట్ నందు జమ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వేద పాఠశాల కార్యదర్శి సూరి లక్ష్మీనారాయణ శర్మ, సభ్యులు మాట్లాడుతూ ప్రాచ్య వేద విద్యను ప్రోత్సహించటానికి దాతలు ముందుకు రావాలని కోరారు. వేద విద్యపై మక్కువతో ఆర్ధిక సహాయం అందించిన దాతలను మనస్ఫూర్తిగా అభినందించారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్