కడప జిల్లాలో ప్రసిద్ధి చెందిన అల్లాడుపల్లె వీరభద్రస్వామి ఆలయంలో స్వామి వారి మూల విరాట్టును నేడు బంగారు పూతరేకులతో అలంకరించారు.
ప్రొద్దుటూరు ప్రాంతంలోని లోని అల్లాడు పల్లె వీరభద్ర స్వామికి ఒక అజ్ఞాత భక్తుడు ఈ ఆభరణాలు సమర్పించాడు. రాగి పరికరాలకు బంగారు పూతతో గర్భగుడుల్లోని భద్రకాళి మాత, శివలింగానికి వాటిని అలంకరించారు.
అజ్ఞాత భక్తులు స్వామివారికి మొక్కుబడిగా వీటిని సమర్పించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ఆభరణాల విలువ రూ.70 లక్షలు పైగా ఉండొచ్చని చెబుతున్నారు.
ఇంత విలువైన ఆభరణాలను చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు.