39.2 C
Hyderabad
March 29, 2024 16: 59 PM
Slider నల్గొండ

ఓట్ల కోసం రాజకీయం చేసే నాయకుడిని కాదు

#MLASaidireddy

ఓట్ల కోసం వచ్చి మాయమాటలు చెప్పి రాజకీయం చేసే నాయకుడిని కాదని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం చితలపాలెం మండల కేంద్రంలో శనివారం బతుకమ్మ చీరలు,  కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రతినిత్యం  ప్రజల మద్యలో ఉంటూ చెప్పిన అభివృద్ధిని చేసి చూపుతానని, మీ అందరి ప్రోద్భలంతో  ఈ గుర్తింపు వచ్చిందని అన్నారు.

అకాల వర్షాలు, ఏ విపత్కార పరిస్థితులలో కూడా సంక్షేమ పథకాలు ఆపని ప్రభుత్వ దేశంలో ఒక్క టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. కేంద్రం ప్రకటించే నిధులు కేవలం పత్రిక పకటనలకే పరిమితం  అని ఎద్దేవా చేశారు. చింతలపాలెం మండలంలో వజినేపల్లి, బుగ్గమాదారం ముంపు గ్రామాలన్నిటిలో కలిపి సుమారు 1170 ఎకరాలు ముంపుకు గురౌతున్నాయని , ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్, మంత్రి కే‌టి‌ఆర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, త్వరలో వీటికి పరిస్కారం ఉంటుందని తెలిపారు.

మండలంలో వడ్డెర బిడ్జి, వడ్డిశెట్టి డొంక, యర్రకుంట తండా నుండి వెంకటాయిపాలెం రోడ్డు వంటి అభివృద్ధి పనులకు  నిధులు  మంజూరు అయినాయని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. అనంతరం మండలం లోని 138 మంది కళ్యాణలక్ష్మి,షాధీముభారక్ లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎం‌పి‌పి కొత్తమద్ది వెంకటరెడ్డి, జెడ్‌పి‌టి‌సి చంద్రకళ సైదిరెడ్డి, మండల పార్టీ  అధ్యక్షుడు మోర్తాలా వెంకటరెడ్డి, సర్పంచ్ అయేషా అమీర్ సాహెబ్, PACS చైర్మన్ రంగాచారి, ప్రధాన కార్యదర్శి దనేశ్వర్ రావు, తహసిల్దార్,MPDO తదితరులు పాల్గొన్నారు.

Related posts

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలి

Satyam NEWS

కంటైన్ మెంట్ జోన్: ఈ ప్రజలకు ఎప్పుడు బుద్ధి వస్తుంది?

Satyam NEWS

పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం ఉడుగుల వాగు బ్రిడ్జి

Satyam NEWS

Leave a Comment