దుబ్బాకలో జరిగిన ఎన్నికలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పతనం దుబ్బాక నుండే ప్రారంభం అయ్యిందని అన్నారు.
అనంతరం బిజెపి నాయకులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ముసుకుల చంద్రారెడ్డి,రామరాజు, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.