సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో బీజేపీని బలోపేతం చేయాలి అంటే వెంటనే పట్టణ అధ్యక్షుడిని మార్చాలని స్థానిక బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు వరకు ఒక్క కార్యకర్తను కూడా బిజెపి పార్టీలో చేర్పించని వ్యక్తి ముసుకుల చంద్రారెడ్డి అని వారు అన్నారు.
అలాంటి వ్యక్తికి హుజూర్ నగర్ పట్టణ అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై స్థానిక బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మున్సిపాలిటీ ఎన్నికలలో కనీసం వార్డు మెంబర్ గా కూడా పోటీ చేయని వ్యక్తి ఆయన అని వారు అన్నారు.
బిజెపి పార్టీ తరఫున ఒక్కరిని కూడా గెలిపించడానికి కృషి చేయ్యని వ్యక్తి, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించిన వ్యక్తి బిజెపికి అవసరం లేదని వారు అన్నారు. పట్టణంలో బూత్ స్థాయి నుండి కమిటీలు వేసి నూతన ఒరవడికి నాంది పలకాలంటే వెంటనే ఆయనను మార్చాలని వారు డిమాండ్ చేశారు.
వెంటనే పట్టణ అధ్యక్షుని మార్చకపోతే సామూహిక రాజీనామాలకు మేము సిద్ధమని బీజేపీ నాయకులు గుండా గోపి, మేళ్లచెరువు లక్ష్మణ్, నర్సింగ్ సతీష్,కంటు నాగరాజు, తిరుమల రావు, సోమ గాని వీరన్న గౌడ్ ,కుక్క డపు నరేష్, బత్తిని సత్యం తదితరులు తెలియజేశారు.
సోమ గాని వీరన్న గౌడ్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో మాట్లాడగా హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు విషయంలో పరిశీలన చేస్తామన్నారు. మేళ్లచెరువు లక్ష్మణ్ జిల్లా నాయకుడు సంకినేనితో ఫోన్లో మాట్లాడగా కమిటీ సభ్యులతో మాట్లాడతానని అన్నారని తెలిపారు.