హుజూర్ నగర్ లో మిషన్ భగీరథ కనెక్షన్ ల కోసం పగులగొట్టిన సిసి రోడ్లను, డ్రైనేజీలు త్వరితగతిన మరమ్మతులు చేయాలని హుజూర్ నగర్ పట్టణ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోల్లపూడి యోహాన్ డిమాండ్ చేశారు. మూడున్నర సంవత్సరాల క్రితం పట్టణంలోని 28 వార్డుల్లో మిషన్ భగీరథ కనెక్షన్ కోసం రోడ్లను, డ్రైనేజీలను పగుల గొట్టారు.
వీటివల్ల రోడ్లమీద, డ్రైనేజీ లలో నీళ్లు ఆగుతున్నాయని, రాబోయేది వర్షాకాలం కాబట్టి దోమలు, ఈగలు, దుర్వాసనలు వస్తున్నందున ప్రజలు అనేక అనారోగ్యా సమస్యలకు గురవుతున్నారని ఆయన అన్నారు. కనుక వెంటనే పై అధికారులను సంప్రదించి పనులు పూర్తి చేయించాలని ఆయన కోరారు.
సీజనల్ వ్యాధులు ప్రారంభం అవుతున్న తరుణం లో అన్ని వార్డులలో డ్రైనేజీలు తీయటం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల మందు కొట్టడం, వంటి శానిటేషన్ పనులన్నీ చేయించాలని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరాల రామకృష్ణ, దగ్గుపాటి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.