32.2 C
Hyderabad
March 28, 2024 23: 05 PM
Slider నల్గొండ

తవ్విన రోడ్లను తక్షణమే బాగు చేయండి

#Hujurnagar Congress Party

హుజూర్ నగర్ లో మిషన్ భగీరథ కనెక్షన్ ల కోసం పగులగొట్టిన సిసి రోడ్లను, డ్రైనేజీలు త్వరితగతిన మరమ్మతులు చేయాలని హుజూర్ నగర్ పట్టణ యువజన కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు కోల్లపూడి యోహాన్ డిమాండ్ చేశారు. మూడున్నర సంవత్సరాల క్రితం పట్టణంలోని 28 వార్డుల్లో మిషన్ భగీరథ కనెక్షన్ కోసం రోడ్లను, డ్రైనేజీలను పగుల గొట్టారు.

వీటివల్ల రోడ్లమీద, డ్రైనేజీ లలో నీళ్లు ఆగుతున్నాయని, రాబోయేది వర్షాకాలం కాబట్టి దోమలు, ఈగలు, దుర్వాసనలు వస్తున్నందున ప్రజలు అనేక అనారోగ్యా సమస్యలకు గురవుతున్నారని ఆయన అన్నారు. కనుక వెంటనే పై అధికారులను సంప్రదించి పనులు పూర్తి చేయించాలని ఆయన కోరారు.

సీజనల్ వ్యాధులు ప్రారంభం అవుతున్న తరుణం లో అన్ని వార్డులలో డ్రైనేజీలు తీయటం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల మందు కొట్టడం, వంటి శానిటేషన్ పనులన్నీ చేయించాలని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరాల రామకృష్ణ, దగ్గుపాటి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు పాటించండి మీ ఆకలి నేను తీరుస్తా

Satyam NEWS

సిస్టర్స్ వృద్ధాశ్రమంలో కొండేటి రాంబాబు పుట్టినరోజు వేడుకలు

Satyam NEWS

మహిళ మోర్చా ఆధ్వర్యంలో 5000 మాస్కుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment