కార్మిక చట్టాలకు సవరణలు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక్కరోజు నిరాహార నిరసన దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న మాట్లాడుతూ అసంఘటిత కార్మికులు ఆదుకోకుండా కుట్రతో పని గంటల విధానాన్ని, సేఫ్టీ చట్టాన్ని, కనీస వేతన చట్టాలను, మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈ దీక్షా కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి, ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్ ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, ఐ ఎన్ టి యు సి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇంటి అచ్చమ్మ పాల్గోన్నారు.
ఇంకా, సిఐటియు నాయకులు యలక సోమయ్య గౌడ్, దుర్గారావు వు ఏ ఐ టి యు సి కార్యకర్త ఇందిరాల వెంకటేశ్వర్లు, మేళ్లచెరువు ముక్కంటి, పాశం రామరాజు స్థానిక కౌన్సిలర్ లు ములకలపల్లి గోపి, ఉమానాగరాజు, వెంకటరెడ్డి, మల్లయ్య, ప్రసాదు, రామిశెట్టి ప్రసాద్ ,వీరస్వామి, దొంతగాని జగన్,కోటయ్య, సైదా ,పెద్దబ్బాయి దీక్షలో పాల్గొన్నారు.