సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని హోటల్స్ ను మునిసిపాలిటీ శానిటరీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు.
హుజూర్ నగర్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కొప్పుల జానకి సోమవారం ఆకస్మిక తనిఖీలలో అపరిశుభ్రంగా ఆహార పదార్ధాలు నిల్వ చేస్తున్న హోటల్ యజమానులను తీవ్రంగా హెచ్చరించారు.
నిర్వహించిన తనిఖీల్లో కొన్ని రోజులుగా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలైన (చికెన్, గ్రుడ్లు, మటన్, బిర్యానీ, బఠానీలు, పల్లీలు) లభ్యమైనట్లు, వాటిని పారబోసి హోటల్ యజమానులకు జరిమానా విధించించినట్లు అధికారులు తెలిపారు.
మరల ఇటువంటివి పునరావృతమైతే మున్సిపల్ చట్టం ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ తనిఖీలో శానిటరీ ఇన్స్పెక్టర్ కొప్పుల జానకి తో పాటు శేఖర్ రెడ్డి, సీతారాములు, శ్రీను,వెంకటేశ్వర్లు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.