సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్ర ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా)సమావేశం ఐజేయూ జిల్లా నాయకులు కోలా నాగేశ్వరరావు,నూకల నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లాలో జరిగింది.
ఈ సమావేశంలో హుజూర్నగర్ ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా)నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
హుజూర్నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా తూముల వెంకటేశ్వర్లు (TVL దక్కన్ క్రానికల్ )వర్కింగ్ ప్రెసిడెంటుగా బి.శ్రీనివాసాచారి(సాక్షి), సోమగాని రాంప్రసాద్ (ఈనాడు), ప్రధాన కార్యదర్శులుగా ధేనుముకొండ శేషంరాజు (ఆంధ్ర ప్రభ),కీతా రామనాథం (సాక్షి ), కోశాధికారిగా దేవరం రామిరెడ్డి(ఆంధ్ర ప్రభ), గౌరవ అధ్యక్షుడిగా దాచేపల్లి దయాకర్ రెడ్డి (నవ తెలంగాణ), ఉపాధ్యక్షులుగా పెందుర్తి భాస్కర్ (వెలుగు), చిట్టి పోతుల రమేష్ (ఆంధ్రజ్యోతి రూరల్), ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా దేవరం వెంకట్ రెడ్డి(ప్రజా పక్షం), కొమర్రాజు అంజయ్య(జనం సాక్షి ), ఇట్టిమళ్ళ రామకృష్ణ (ప్రజా పోరాటం ), గౌరవ సలహాదారులుగా నూకల నరేందర్ రెడ్డి(ఈనాడు),కోల నాగేశ్వర్ రావు (ఆంధ్ర జ్యోతి)అధికార ప్రతినిధిగా పిల్లలమర్రి శ్రీనివాసరావు(ప్రజా పక్షం)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహాయ,సహకారం అందిస్తామని అన్నారు.