27.7 C
Hyderabad
April 26, 2024 03: 51 AM
Slider నల్గొండ

భగవద్గీత పోటీలలో ప్రథమ స్థానం సాధించిన హుజూర్ నగర్ వాసి

#geta

నల్లగొండ జిల్లా కేంద్రంలో గీతా జయంతి మహోత్సవ సందర్భంగా  నిర్వహించిన శ్రీ భగవద్గీత పోటీలలో హుజూర్ నగర్ పట్టణానికి చెందిన సిహెచ్ బాల సైదులు ఉమా దంపతుల ఏకైక కుమారుడు ఈషాంత్ యాదవ్ ప్రథమ స్థానం పొందారు. ఈషాంత్ యాదవ్ గత సంవత్సరం జరిగిన పోటీలో కూడా ప్రథమ స్థానం సాధించడం విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు.భగవద్గీత కంఠస్థ పోటీలలో  ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయిలో రెండుమార్లు ప్రథమ స్థానం సంపాదించడం అభినందనీయమని కొనియాడారు.

ఈ సందర్భంగా విద్యార్థి ఈషాంత్ యాదవ్ ను పలువురు అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా ప్రథమ స్థానం సాధించి హుజూర్ నగర్ పట్టణ ప్రత్యేకతను నిలపాలని కోరారు. శ్రీ భగవద్గీత పట్ల ప్రావీణ్యత సాధించేందుకు ప్రోత్సహించిన తల్లిదండ్రులను పలువురు అభినందించారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

నెల్లూరు రంగనాయకల పేట లో ఉగాది ఉత్సవాలు

Satyam NEWS

తప్పిన ప్రమాదం.. స్టేషన్ కు చేరిన యవ్వారం….!

Satyam NEWS

వడ్డెరలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం: మల్లు రవి

Satyam NEWS

Leave a Comment