39.2 C
Hyderabad
April 23, 2024 16: 25 PM
Slider ప్రత్యేకం

బాసర త్రిబుల్ ఐటీ కి ఎంపికైన విద్యార్థులను అభినందించిన శానంపూడి

#MLASaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన చెందిన కుక్కునూరి పృథ్వి తేజ,చంద్రకంటి రాహుల్ విద్యార్థులు బాసర త్రిబుల్ ఐటీ లో  సీటు సాధించారు.

కుక్కునూరి  పృథ్వి తేజ 120 మార్కులకుగాను 104 మార్కులు సాధించి 314 ర్యాంకు పొందగా,రాహుల్ అనే విద్యార్థి 92 మార్పులతో 1351 ర్యాంకు సాధించారు.సాప్ట్ వేర్ ఇంజనీర్ లక్ష్యంగా కష్టపడి చదివి సీటు సాధించిన సందర్భంగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి,మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి,వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు లు విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా శానంపూడి సైది రెడ్డి మాట్లాడుతూ ఐఐఐటి విద్యార్థులు ఇంకా ఉన్నత స్థానానికి వెళ్లి హుజూర్ నగర్ కి మంచి పేరు తేవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కుక్కునూరి వెంకన్న,చంద్రకంటి వెంకటేశ్వర రావు, తదితరులు లు పాల్గొన్నారు.

బాచిమంచి చంద్రశేఖర్, సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఉచిత కంటి పొర చికిత్స శిబిరాన్ని సందర్శించిన మంత్రి రోజా

Satyam NEWS

స్టేష‌న్ భ‌వనం నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన ఎస్పీ దీపిక….!

Satyam NEWS

తిరుమల  ఘాట్ లో ఎలక్ట్రిక్ బస్సు ట్రయల్ రన్

Satyam NEWS

Leave a Comment