ఆకలికి తాళలేక పిట్టలు (పక్షులను) కాల్చుకు తింటున్న యువకుడిని చేరదీసి అన్నం పెట్టారు ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. చల్వాయి,మచ్చపూర్ గ్రామాల మధ్య రోడ్డు ప్రక్కన ఓ యువకుడు ఆకలికి తట్టుకోలేక పిట్టలను కాల్చుకొని తిని, పొలంలోని నీరును త్రాగుతుండగా అతడిని చూసిన తస్లీమా హృదయం చలించిపోయింది.
అతడి ఆకలిని తీర్చడం కోసం జంగాల పల్లి గ్రామంలోని హోటల్ కి తీసుకెళ్ళి అన్నం పెట్టీ ఆకలిని తీర్చారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ ఆకలికి తట్టుకోలేక చాలా మంది మరణిస్తున్నారని, ఎవరైనా ఆకలితో కనిపిస్తే పట్టెడు అన్నం పెట్టండి అని తస్లీమా అన్నారు.