కర్నూలు జిల్లా శ్రీశైలం మహా పుణ్య క్షేత్రంలో నేడు హుండీ లెక్కింపు నిర్వహించారు.
కరోనా కష్ట కాలంలో కూడా శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం దాదాపుగా రూ.2 కోట్లు వచ్చింది.
28 రోజుల పాటు భక్తులు శ్రీ స్వామి అమ్మవార్లకు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ. 2,00,75,148/-నగదు, విదేశీ కరెన్సీ లభించిందని ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు.
శైలమహాక్షేత్రంలో ని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం హుండీల లెక్కింపు బుధవారం ముగిసింది.