నిర్మల్ జిల్లా బాసరలో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపు ప్రారంభం అయింది. ఆరు నెలలకు మొత్తం 51 లక్షల రూపాయల మేరకు బంగారం, వెండి, విదేశీ కరెన్సీ వచ్చాయి. అమ్మవారి హుండీల లెక్కింపులో 80 గ్రాముల 200 మిల్లీ గ్రాములు మిశ్రమ బంగారం, 2 కిలోల 20 గ్రాముల 10 మిల్లి గ్రాములు మిశ్రమ వెండి, 24 ఫారిన్ కరెన్సీ నోట్లు వచ్చాయి.
మొత్తం వీటి విలువ 51,56,268 రూపాయలు ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ నుంచి హుండీ లెక్కింపు జరగలేదు. అప్పటి నుంచి లాక్ డౌన్ తదితర కారణాల వల్ల భక్తులు రావడం కూడా తగ్గడంతో ఇప్పుడు హుండీ లెక్కింపు ప్రారంభించారు.