తూర్పుగోదావరిజిల్లా కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు లో దారుణం జరిగింది. ఓ భర్త భార్యపై డంబెల్తో దాడి చేశాడు. దాంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.
కొవ్వూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చెడు వ్యసనాలకు బానిస అయిన అతను కొన్నాళ్లుగా భార్యను వేధిస్తున్నాడు.
పిల్లల ముందే కొట్టడం, శారీరకంగా హింసించడం చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం భార్యపై హత్యాయత్నం చేశాడు. కుమార్తెలతో సైతం అసభ్యంగా ప్రవర్తించేవాడు.
చివరికి ఉన్మాదిలా మారి రాత్రి భార్య తలపై డంబెల్తో బలంగా కొట్టగా తీవ్ర గాయమైంది. విషయం తెలుసుకున్నబంధువులు మాధవిని ఆస్పత్రికి తరలించారు.
అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు.
తన భర్తకు అధికారపార్టీకి చెందిన ఓ నేత అండగా ఉన్నాడని అందుకే పోలీసులు ఫిర్యాదు చేసిన సరిగా పట్టించుకోవడం లేదని మాధవి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం శ్రీను పరారీలో ఉన్నాడు.