శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజక వర్గం రణస్థలం మండలం వేల్పురాయి గ్రామానికి చెందిన బాలి వెంకటరావు భార్య అక్కమ్మను గడ్డ పారతో తలపై నరికి లారీకి ఎదురుగా వెళ్లి లారీ క్రింద పడి మృతి చెందాడు. భార్యాభర్తల మధ్య గొడవ జరగడం వల్ల అక్కమ్మ తలపై గడ్డపారతో కొట్టి చంపాడు వెంకటరావు.
అదే ఆవేశంలో బైక్పై పైడి బీమవరం జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ వైపు దూసుకెళ్లి లారీని ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.