31.7 C
Hyderabad
April 18, 2024 23: 04 PM
Slider తూర్పుగోదావరి

అక్రమ సంబంధం: అతి దారుణంగా భార్యను చంపిన భర్త

#murder

తూర్పు గోదావరి జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను నిలదీసినందుకు భార్య హత్య కు గురైంది.

ముమ్మిడివరం మండలం నక్కా వారి పేట లో ఈ దారుణం జరిగింది. రవీంద్ర అనే వ్యక్తికి వేరే మహిళ తో అక్రమ సంబంధం ఉండేదట.

ఈ విషయంపై ఆయన భార్య కాశీ దుర్గా ఈశ్వరి ఆయనతో తరచూ గొడవ పడుతుండేది. గత కొంత కాలం గా భార్య, భర్త ల మధ్య ఈ వివాదం నడుస్తూ ఉన్నది.

ఈ కారణంగానే భర్త రవీంద్ర రాత్రి తన భార్య దుర్గా ఈశ్వరి ను చంపి ప్రక్కనే ఉన్న కాలువలో పడేశారు. భార్యను హత్య చేసిన తర్వాత అతనే స్వయంగా వచ్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

జరిగిన విషయాన్ని మొత్తం పోలీసులకు చెప్పాడు. సంఘటనా స్థలానికి చేరుకొన్న ముమ్మిడివరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

సేవ్ ట్రీ: బిచ్కుందలో వాటరింగ్ డే

Satyam NEWS

పాతబస్తీ పాఠశాలల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

Bhavani

కంటోన్మెంట్ కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణకై ఉద్యమిద్దాం

Satyam NEWS

Leave a Comment