మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోరిగూడెం గ్రామానికి చెందిన గిరిజన వాడలో బానోతు అనూష(35)అను మహిళ అనుమానదాస్పదంగా మృతిచెందింది.
మహబూబాబాద్ మండలం శనిగాపురం గ్రామ శివారు కుమ్మరికుంట్ల తండాకు చెందిన అనుషకు మంగోరిగూడెం గ్రామానికి చెందిన బానోతు వీరన్నకు గత 10 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది.
కొన్నేళ్లుగా అన్యోన్యంగా సాగిన వీరి జీవితంలో ఇద్దరు కూతుళ్ళు ను కలిగారు. అనంతరం అనూష జీవితం పై అనుమానపు నీడలు కమ్ముకున్నాయి. గత కొన్నెళ్ళుగా మృతురాలుఅనూషను భర్త వీరన్న అక్రమ సంబంధం నెపంతో తరచుగా కొట్టేవాడు, గతంలోను భర్త వేదింపులు తాళలేక పోలీసులకు పిర్యాదు చేశారు.
పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేశారు. ఇటీవల గొడవ జరుగగా తన తల్లిగారి ఇంటికి వెళ్లిన అనుషను మళ్ళీ ఒప్పించి ఎలాంటి గొడవలు పెట్టుకొనని నమ్మించి తీసుకొచ్చి విచక్షణ కోల్పోయి తీవ్రంగా కొట్టి ,ఉరివేసి చంపాడని మృతురాలి సోదరుడు రాకేష్ ఆరోపించాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.