కుటుంబ కలహాల కారణంగా ఒక భర్త తన భార్యను దారుణంగా కొట్టాడు. దాంతో ఆమె ఇప్పుడు చావుబతుకుల మధ్య కొట్టుకుపోతున్నది.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని పీక్లా తండాలో నేడు ఈ దారుణం జరిగింది. వెంకన్న అనే వ్యక్తి లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
ఏం జరిగిందో ఏమో కానీ భార్య అయిన శారదను దారుణంగా కొట్టాడు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా శారద గృహిణిగా జీవనం కొనసాగిస్తున్నట్లు సమాచారం.
చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న శారద ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. భార్య శారద ను తీవ్రంగా కొట్టి గాయపరచిన భర్త భానోతు వెంకన్న పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.